ఏ 2 టీవీ న్యూస్ మార్చి 8 మెదక్ జిల్లా ప్రతినిధి:
మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ఆదివారం చాకరిమెట్ల హనుమాన్ టెంపుల్ను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పూజారులు, ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పూజారులు అదనపు ఎస్పీ గారికి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో శివంపేట్ ఎస్ఐ మధుకర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

