– గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరం : సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి
ఏ2డిజిటల్ న్యూస్, జూన్ 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)


మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పులిమామిడి గ్రామంలో బుధవారం గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామ సెక్రటరీ సబిత, ఉప సర్పంచ్ మద్దూరి రాజు, వార్డు సభ్యుడు మంగలి లక్ష్మణ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ సబిత మాట్లాడుతూ, 99 రోజుల ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో “మన వ్యర్థాల నిర్వహణ” నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామ పంచాయతీకి అందించాలని సూచించారు. అలాగే పూర్వకాలంలో ఉపయోగించిన ఇస్తరాకులతో భోజనం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ ప్రజల సమస్యలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే గ్రామ సభల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.గ్రామాభివృద్ధి, పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, స్వచ్ఛమైన పులిమామిడి గ్రామ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, ప్రజా భాగస్వామ్యంపై నిర్వహించిన ఈ గ్రామ సభ విజయవంతంగా ముగిసింది.

