ఏ2టీవీ న్యూస్, మార్చి11,మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కుల్చారం మండలంలో కీలక చర్యలు చేపట్టారు. ఏడుపాయల టీ జంక్షన్ నుండి రెండవ బ్రిడ్జ్ వరకు మొత్తం 32 కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలను ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ప్రారంభించారు. ఈ కెమెరాల ద్వారా వాహనాల రాకపోకలు, ప్రజల కదలికలను నిరంతరం పర్యవేక్షించే అవకాశం కలుగుతుంది. అలాగే అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలను సులభంగా గుర్తించే విధంగా పోలీసులకు సహాయపడతాయి. నేరాలను నిరోధించడం, గుర్తించడం మరియు చట్టం-సువ్యవస్థను కాపాడడంలో ఈ సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించనున్నాయి. నేరాల దర్యాప్తు మరియు విచారణలో కూడా పోలీసులకు ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయి. ఈ సందర్భంగా ప్రజలు కూడా పోలీసులకు సహకరించి శాంతి భద్రతలను కాపాడటంలో భాగస్వాములు కావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

