ఏ2టీవీ న్యూస్,మార్చి16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము).
మెదక్ జిల్లా డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో సోమవారం సాయంత్రం భారీ వడగళ్ల వాన కురిసింది. వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణలో బలమైన గాలులతో వర్షం పడే అవకాశం ఉందని సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నర్సాపూర్ పట్టణం లో సాయంత్రం భారీ గాలులతో వడగళ్ల వానతో తడిసి ముద్దయింది. ఇప్పటివరకు అత్యధిక ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలు వాతావరణ ఒక్కసారిగా చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నట్లు అయింది.

