Wednesday, May 6, 2026

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ కార్యక్రమం

ఏ2టీవీ న్యూస్, మార్చి18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

కొల్చారం:మండలంలోని పోతంశెట్టిపల్లి మరియు రంగంపేట రైతు వేదికల్లో రైతులకు ప్రకృతి వ్యవసాయం పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు మండలంలో నాలుగు క్లస్టర్లను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. కొల్చారం, హంసానిపల్లి, పోతంశెట్టిపల్లి, ఎనగండ్ల గ్రామాలను క్లస్టర్లుగా గుర్తించి, ప్రతి క్లస్టర్‌లో 125 మంది రైతులను ఎంపిక చేసి శిక్షణ అందించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లు మరియు సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. సంబంధిత క్లస్టర్ మండల వ్యవసాయ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular