

ఏ2టీవీ న్యూస్, మార్చి20,మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
టేక్మల్ మండల కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఆగ్రో సేవా కేంద్రం, గ్యాస్ గోదాం పరిశీలించగా, అనంతరం కేజీవీబీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాలలో స్టోర్ రూమ్, కిచెన్, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం, ఉచిత విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.ఆగ్రో సేవా కేంద్రంలో రికార్డులు, స్టాక్ వివరాలు పరిశీలించిన ఆయన… రైతులకు ఎరువులు, మందులు అందుబాటులో ఉంచాలని, ముఖ్యంగా యూరియా సరఫరాను వేగవంతం చేయాలని అన్నారు.గ్యాస్ గోదాంలో పరిస్థితులను సమీక్షిస్తూ… జిల్లాలో గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.గ్యాస్ సమస్య సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

