ఏ2టీవీ న్యూస్, మార్చి 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ఆదివారం నాడు చముండేశ్వరి అమ్మవారిని ఘనంగా దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ పూజారులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ వాతావరణంలో కొంతసేపు గడిపిన అదనపు ఎస్పీ, అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు.అనంతరం ఆయన ఆలయ పరిసరాలను పరిశీలించి, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.

