ఏ టు టీవీ న్యూస్ మార్చి 23 మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అందుతున్న దరఖాస్తులను అధికారులు జాప్యం లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి మొత్తం _దరఖాస్తులు స్వీకరించారు.ఈ దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే సోమవారం జరిగే ప్రజావాణి నాటికి అన్ని దరఖాస్తులు పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.సమస్యల పరిష్కారం కోసం ప్రజలు దూర ప్రాంతాల నుంచి వస్తున్నందున, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం కనబరిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డి.ఆర్.డి.ఓ పి.డి శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

