Thursday, May 7, 2026

కల్తివి తినకండి…అనారోగ్యం పాలు కాకండి…! కంటతడి పెట్టిన డాక్టర్…!

ఏ2టీవీ న్యూస్,మార్చి23, ప్రత్యేక ప్రతినిధి (రాము)

ఆహార పదార్థాలు కల్తీవి తిని అనారోగ్యం పాలు కావద్దని, ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ రాజ్యమేలుతున్నందున ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని రోగులకు సూచిస్తూ ఓ వైద్యుడు కంటతడి పెట్టిన సంఘటన ఇది. కరీంనగర్ జిల్లా కేంద్రమైన ప్రభుత్వ ఆసుపత్రి వెనకాల టైం న్యూరో కేర్ ఆస్పత్రి డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ మంచి హస్తవాసి అన్న పేరు ఉంది. ఆ పెరుకు తగ్గట్టే ఆయన సాదాసీదాగా ఉంటూ తన వద్దకు అనారోగ్యంతో వచ్చే రోగులకు వైద్యం చేయడమే కాకుండా మనోధైర్యాన్ని నింపడం ఈయన కున్న ప్రత్యేకత. కేవలం తెలంగాణ రాష్ట్రమే కాకుండా వైజాగ్, బెంగళూరు, మహారాష్ట్ర వంటి సుదూర ప్రాంతాల్లో సైతం ఈయన పేషెంట్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా పక్షవాతం, నరాలకు సంబంధించిన వైద్యం చేయడంలో ఈయన సిద్ధహస్తుడు అన్న పేరు ఉంది. అయితే తన వద్దకు వచ్చే పేషెంట్లకు కౌన్సిలింగ్ ఇస్తూఆరోగ్యసలహాలు,సూచనలుఅలాగేతినేపదార్థాలు మన ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు గురించి చక్కగా వివరించడం పేషెంట్లు విని ఆచరించడం కద్దు. అయితే ఈ మధ్య ఎంతకూ కల్తీ పదార్థాలు తినవద్దని తిని అనారోగ్యం పాలై చేతులారా అనారోగ్యాలను కొని తెచ్చుకోవద్దని పేషెంట్లకు సూచిస్తూ ఒక్కసారిగా కంటతడి పెట్టడంతో అక్కడున్న పేషెంట్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరోవైపు మా మంచి కోరే డాక్టర్ అని సంతోషమూ వ్యక్తం చేశారు. ఇది కాస్త వీడియో తీసి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వైరల్ అయ్యేసరికి నెట్టింట హల్చల్ చేస్తుంది. కల్తీ వల్ల మన ఆరోగ్యాలు ఎంతలా పాడవుతున్నాయో చెప్పకనే చెప్పినట్లు అవుతుందని పలువురుచర్చించుకుంటున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular