ఏ2టీవీ న్యూస్, మార్చి24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్: ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. పెండింగ్లో ఉన్న వివాదాలను వేగంగా, సులభంగా పరిష్కరించుకునే మంచి అవకాశం ఇదని తెలిపారు.క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి వివాదాలు, కుటుంబ సమస్యలు, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్ వంటి కేసుల్లో పరస్పర చర్చల ద్వారా రాజీ సాధ్యమని చెప్పారు. దీని ద్వారా కోర్టు చుట్టూ తిరుగాల్సిన అవసరం తగ్గి, సమయం మరియు ఖర్చు ఆదా అవుతుందని పేర్కొన్నారు.“రాజీయే రాజమార్గం” అంటూ, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. రాజీ పడదగిన కేసులను గుర్తించి పోలీస్, కోర్టు సిబ్బంది కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు.

