Thursday, May 7, 2026

నెలవారీ నేర సమీక్షా సమావేశంరాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కేసులు నమోదు చేయాలి: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ఏ2టీవీ న్యూస్, మార్చి24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లా పోలీసు అధికారులతో కలిసి అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులు, మిస్సింగ్ కేసులు, (ఎన్‌బీడబ్ల్యూ) ఎస్సీ/ఎస్టీ కేసుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు.ప్రతి కేసు స్థితిగతులను వివరంగా తెలుసుకొని పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తులో వేగం పెంచడంతో పాటు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా సున్నితమైన ఎస్సీ/ఎస్టీ కేసుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు.నేరాల నివారణలో భాగంగా ప్రతిరోజూ వాహన తనిఖీలు నిర్వహించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి రోడ్డు భద్రతను కాపాడాలని ఎస్హెచ్‌వోలకు ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని తెలిపారు.పోలీస్ స్టేషన్ పరిధుల్లో రాత్రిపూట క్రమం తప్పకుండా పెట్రోలింగ్ నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని సూచించారు. డయల్ 100 కాల్స్‌కు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి త్వరగా చేరుకోవాలని, బాధితుల సమస్యలను ఓపికగా విని వారికి అండగా నిలవాలని తెలిపారు. ప్రజల విశ్వాసం పెంపొందించేలా పోలీసులు విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సుభాష్ చంద్ర బోస్, సీఐలు జార్జ్, రంగా కృష్ణ, సందీప్ రెడ్డి, రేణుక రెడ్డి, జాన్ రెడ్డి, కృష్ణమూర్తి తదితరులు, జిల్లా ఎస్‌ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular