ఏ2టీవీ న్యూస్, మార్చి 24,మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.ఆడివయ్య హెచ్చరించారు. మెదక్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి బడ్జెట్లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు.భూ సమస్యలు, ఇండ్లు–ఇళ్ల స్థలాల సమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు, రోడ్ల దుస్థితి, ఉపాధి హామీ కూలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. సంవత్సరం క్రితం వినతిపత్రం ఇచ్చినా అధికారులు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.వెల్దుర్తి, టేక్మల్, రేగోడ్, నిజాంపేట, రామాయంపేట, శివంపేట, చిలప్చేడ్ మండలాల్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో మార్పులతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, రోజుకూలి రూ.800కు పెంచి సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు.జిల్లాలో భూ వివాదాలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పలు గ్రామాల్లో రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు మిగిలిన ఇళ్లను పేదలకు కేటాయించాలని అన్నారు.చేయూత పింఛన్లు రూ.4000 వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

