Thursday, May 7, 2026

పెట్రోల్ బంక్ పనులను పరిశీలించిన అదనపు ఎస్పీ ఎస్. మహేందర్

ఏ2టీవీ న్యూస్, మార్చి25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పెట్రోల్ బంక్ నిర్మాణ పనులను అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పరిశీలించారు.బుధవారం ఆవుసులపల్లి గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఈ పెట్రోల్ బంక్ పనులను ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేసి, పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిన అవసరమని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ప్రదేశంలో ఉన్న పరిస్థితులను సమీక్షించి, అవసరమైన మౌలిక సదుపాయాలను సమగ్రంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పెట్రోల్ బంక్ అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలకు ఇంధన సౌకర్యం సులభంగా లభించడంతో పాటు, ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.అదనపు ఎస్పీ వెంట ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, ఆర్ఎస్ఐ మహిపాల్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular