సంఘటన స్థలాన్ని పరిశీలించిన అదనపు ఎస్పీ మహేందర్
ఏ2టీవీ న్యూస్, మార్చి 25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా శంకరంపేట్ (ఆర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగరాయి గ్రామంలో మధ్యాహ్న సమయంలో దారుణ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి వృద్ధ దంపతులు అంజయ్య, సావిత్రి నివాసంలోకి ప్రవేశించి సుత్తితో దాడి చేసి, వారి వద్ద ఉన్న సుమారు 5 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని బైక్పై పరారయ్యాడు.దాడిలో తీవ్రంగా గాయపడిన దంపతులను స్థానికులు వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.ఘటనపై సమాచారం అందుకున్న మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. దుండగులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తూ, నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీతో పాటు డీఎస్పీ తూప్రాన్ నరేందర్ గౌడ్, సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్ఐ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

