ఏ2టీవీ న్యూస్,మార్చి 26,మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఎక్కడా లేదని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అసత్య వదంతుల వల్ల ప్రజలు అనవసరంగా ఆందోళనకు గురవుతూ, పెట్రోల్ బంకులకు భారీగా వెళ్లి ఇంధనం నింపించుకునే ప్రయత్నం చేస్తున్నారని మంగళవారం తెలిపారు.జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఎటువంటి కొరత పరిస్థితి లేదని, ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు.అవసరానికి మించి నిల్వ చేసుకోవడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలగడంతో పాటు గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. సోషల్ మీడియాలో నిర్ధారించని సమాచారాన్ని నమ్మకూడదని, వాటిని ఇతరులకు పంపకుండా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.వదంతులు వ్యాప్తి చేసి ప్రజల్లో భయం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

