Thursday, May 7, 2026

మహిళా సమాఖ్య భవనానికి ఘనంగా భూమిపూజ

ఏ2టీవీ న్యూస్, మార్చి 31, శివంపేట్ ప్రతినిధి (రామకృష్ణ)

మెదక్ జిల్లా శివంపేట్ మండలం, కొత్తపేట గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.గ్రామ సర్పంచ్ రాములు, ఉప సర్పంచ్ శేఖర్ గౌడ్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి దానం చేసిన మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి గారికి గ్రామ ప్రజలు మరియు పాలకవర్గ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలను గ్రామస్తులు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular