ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 5, నర్సాపూర్ నియోజకవర్గం ప్రతినిధి (పద్మ బిక్షపతి)
ఆదివారం మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో నర్సాపూర్ శాసనసభ్యులు సునీతా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు ఉపసర్పంచ్ రవీందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ దొడ్లే ఆంజనేయులు మాట్లాడుతూ..పేదల పాలిటి పెన్నిధి మనసున్న మహారాణి సునీతమ్మ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అలాగే ప్రజాసేవలో ముందు ముందు ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఈ శుభ సమయంలో కోరుచున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు పలువురు వార్డు మెంబర్లు, కార్యకర్తలు భారీగా పాల్గొనడం జరిగింది

