ఏ2టీవీన్యూస్, ఏప్రిల్ 5, నర్సాపూర్ ప్రతినిధి (రామ్ చందర్)
డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు శాఖమూరి యాదగిరి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరువలేనివని, ముందు తారాలకు ఎంతో ఆదర్శమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తొంట అశోక్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

