ఏ2టీవీ న్యూస్ నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి ( బుచ్చన్న)

నర్సాపుర్ పట్టణంలోనీ శ్రీ సాయి కృష్ణా గార్డెన్స్ లో నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రెండవ జాబ్ మేళా విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మొత్తం సుమారు 600 మంది యువత హాజరై ఉద్యోగ అవకాశాల కోసం పాల్గొన్నారు.జాబ్ మేళాలో వివిధ సంస్థలు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశాయి. అందులో భాగంగా 200 మందికి ఉద్యోగ అవకాశాలు లభించగా, మరో 150 మంది అభ్యర్థులు తదుపరి దశల కోసం షార్ట్లిస్ట్ చేయబడ్డారు.ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం తన ముఖ్య లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని జాబ్ మేళాలను నిర్వహించి నిరుద్యోగ యువతకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత ఆవుల రాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని కోరారు.

