Thursday, May 7, 2026

ఎమ్మెల్యే జన్మదిన పురస్కరించుకొని హోమం పూజలు నిర్వహించిన శశిధర్ రెడ్డి

ఏ2టివి న్యూస్, ఏప్రిల్ 6, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా చాకరిమెట్లు శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే సునీత రెడ్డి తనయుడు శశిధర్ రెడ్డి వేద పండితులు ఆంజనేయ శర్మ మంత్రోచ్ఛారణల మధ్య హోమం,ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కోసం భక్తులు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, స్థానిక ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.అనంతరం నర్సాపూర్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు పండ్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమాలలో స్థానిక ప్రజలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular