ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 6, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)
నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి సహకారంతో కొల్చారం మండలానికి చెందిన పలు కుటుంబాలకు సుమారు పది లక్షల రూపాయల విలువగల ఏంఆర్ఎఫ్ చెక్కులను 34 మందికి అందజేయడం జరిగిందని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హంసాన్పల్లి మాజీ సర్పంచ్ మన్నే శ్రీనివాస్, చిన్న ఘనపూర్ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి పలు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నాయకులు.

