ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 7, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ మోత్కు నిర్మల మల్లేశం, టీఆర్ఎస్ పార్టీ కొల్చారం మండల యువత విభాగం అధ్యక్షుడు సంతోష్ రావు ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులుగా రూ.6 లక్షలతో ఈ పనులు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, గ్రామ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కోనాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.అలాగే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సహకారంతో మరిన్ని నిధులను తీసుకువచ్చి గ్రామ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

