Thursday, May 7, 2026

రామాయంపేటలో కలెక్టర్ ప్రతిమా సింగ్ విస్తృత పర్యటనకస్తూరిబా పాఠశాల, రేషన్ దుకాణం పరిశీలన

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

రామాయంపేటలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించి, అక్కడి మౌలిక వసతులు మరియు విద్యా నైపుణ్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినులతో స్వయంగా మాట్లాడి, వారికి పాఠాలు బోధిస్తూ వారి విద్యా సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థినుల ప్రతిభను అభినందించిన కలెక్టర్, నాణ్యమైన గుణాత్మక విద్య అందించాలన్నారు.అలాగే పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు చేయాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.తదుపరి రేషన్ దుకాణాన్ని పరిశీలించిన కలెక్టర్, లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular