Thursday, May 7, 2026

ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో రోడ్లు & భవనాల శాఖ (ఆర్ అండ్ బి), పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ అండ్ బి శాఖ ద్వారా నిర్మాణంలో ఉన్న రహదారులు, కోర్టు భవనాల పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని తక్షణమే పరిష్కరించుకుని పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.అనంతరం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులపై కూడా సమీక్ష నిర్వహించి, పనుల్లో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఈఈ వేణు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఈ నరసింహులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular