Thursday, May 7, 2026

యోగాతో ఆరోగ్య చైతన్యం – మెదక్‌లో ఘనంగా హోమియోపతి దినోత్సవం

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

శుక్రవారం ఉదయం మెదక్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో విశేషమైన కార్యక్రమం జరిగింది. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ హెల్త్ వీక్‌లో భాగంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం (ఆయుష్ డే) సందర్భంగా యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీవో రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శివ దయాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, డీఎస్పీ ప్రసన్న కుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి కూడా పాల్గొన్నారు.వశిష్ట యోగా కేంద్రం ప్రసిద్ధ యోగా గురువులు ఆకుల రవి, పతంజలి యోగ గురువు మనోరంజని పాల్గొని యోగ సాధనపై అవగాహన కల్పించారు.కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో అవసరమని అధికారులు పేర్కొన్నారు.హెల్త్ వీక్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెంపొందించడంలో కీలకంగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular