ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్ రామస్వామి, సీఏ రాజేశ్వరి, వార్డు సభ్యులు కలిసి ప్రారంభించారు. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని రైతులు, మహిళలు పాల్గొన్నారు.

