Thursday, May 7, 2026

ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధిమహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా

ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 11, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ధ్యాన్చంద్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం ఫూలే చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం అందరికీ ఆదర్శమని అన్నారు.కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ నరేష్, ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఫూలే ఆశయమని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల జయరాములు, నాయని బ్రాహ్మణి సంఘం అధ్యక్షులు ఉప్పల స్వామి, మాల మహానాడు గౌరవ అధ్యక్షులు మాసాయిపేట మల్లేశం, బి సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular