
ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 11, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ పాఠశాల పరిసరాల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారంపై ఏ2టీవీ రెండు రోజుల క్రితం ప్రచురించిన వార్త కథనం ఫలితాన్ని ఇచ్చింది.పాఠశాల గోడ అవతలి భాగంలో చెత్తను పారవేస్తుండటాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం స్పందించింది.ఈరోజు చెత్తాచెదారాన్ని తొలగిస్తూ, వాటిని కాల్చివేసి పరిసరాలను శుభ్రపరిచింది.స్థానికులు ఏ2టీవీ చొరవను అభినందిస్తూ, సమస్యలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

