ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 13,నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)
నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ చౌకదారుల దుకాణంను ఆదివారము అదనపు కలెక్టర్ నగేష్ తనిఖీ చేశారు. రికార్డులను, బియ్యం విలువలను పరిశీలించి రేషన్ కార్డు దారులతో మాట్లాడారు, కార్డుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ చేయాలని డీలర్ కు సూచించారు,పిడిస్ లో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని రేషన్ షాప్ డీలర్లు సమయపాలన పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

