ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 14, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
తెలంగాణ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2025-26 విద్యా సంవత్సర ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరచి ఉత్తమ ఫలితాలు సాధించారు.ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోబైపీసీ విభాగంలో పావని 946/1000 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది.సీఈసీ విభాగంలో మేఘన 927/1000,ఎంపీసీ విభాగంలో రేణుశ్రీ 903/1000,ఎంఈసీ విభాగంలో శృతి 874/1000 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.అలాగే, ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లోఎంపీసీ విభాగంలో హర్షిత 460/470 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా,సీఈసీ విభాగంలో తేజ 445/500,బైపీసీ విభాగంలో పూజ 411/440,ఎంఈసీ విభాగంలో లోకేష్ రెడ్డి 315/500 మార్కులు సాధించారు.ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను “ఆదర్శ పాఠశాల ఆణిముత్యాలు”గా కొనియాడుతూ, వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.స్థానిక సర్పంచ్ శ్రీ కంచర్ల చంద్రశేఖర్, గ్రామ పాలకమండలి సభ్యులు, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి వాణి కుమారి మరియు అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించి ఘనంగా సన్మానించారు.

