ఏ2టీవీన్యూస్, ఏప్రిల్ 14,నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నాయిని జలాల్పూర్ గ్రామంలో రోడ్డు భద్రత రోడ్డుపై జరిగే ప్రమాదాల పై అవగాహన కార్యక్రమం గ్రామసభ గ్రామ సర్పంచ్ దేవీ సింగ్ ఉపసర్పంచ్ వెంకట నర్సింహులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారికంగా పాల్గొన్నఎంపీడీవో ఉన్నిసా బేగం మాట్లాడుతూ.. వాహనాలు నడిపేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అత్యధిక వేగం ప్రమాదాలకు నిలయంగా మారుతుందని ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ప్రమాదాలను నివారించాలని గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనంతరం గ్రామంలోని పలు సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

