ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 14 చిన్న శంకరంపేట(ప్రతినిధి కమ్మరి దేవరాజు)
భారత రాజ్యాంగ నిర్మాత 135వ జయంతి సందర్భంగా మంగళవారం చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ముత్తిగళ్ల రామచందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ సృష్టికర్త బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆలు పెరగని పోరాటం చేసి కుచ్ చేసిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు ఆయన అడుగుజాడలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్తిగల రామచంద్రం, సర్పంచ్ కంచర్ల చంద్రశేఖర్, ఉప సర్పంచ్ హేమ భాను ప్రసాద్ ,మాజీ సర్పంచ్లు శ్రీమన్నారాయణ రెడ్డి, రాజిరెడ్డి, ఎస్సై నారాయణ గౌడ్, ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రెపోచయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు మురళి మాదిగ, రాష్ట్ర కార్యదర్శి బందెల సాయిలు, మాల మహానాడు వ్యవస్థాపకులు బొమ్మరబోయిన మైసయ్య, దొంత దుర్గపతి, కర్నే సాయిలు, చెట్లపల్లి యాదగిరి, సడిమెల నారాయణ, ఎరుకల గంగ, ఎండి. జహంగీర్, ఉడుత శ్రీమన్, ఎండి జావిద్, నాగరాజు, తోపాటు తదితరులు పాల్గొన్నారు.

