ఏ2టీవీ న్యూస్,ఏప్రిల్ 14:-చిన్నశంకరంపేట ప్రతినిధి,( కమ్మరి దేవరాజు)
30 ఏళ్లుగా సొంత ఇంటి కోసం ఎదురుచూస్తూ అద్దె ఇంట్లో నివసిస్తూ ఇంటి కోసం అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఇల్లు మంజూరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలో నే ఇందిరమ్మ కమిటీ ద్వారా ఇల్లు మంజూరు కావడంతో ఆ ఇంటి యజమాని కుటుంబీకులు సంతోషానికి హద్దులు లేవు. నార్సింగ్ మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన నాగులు గారి అశోక్ గౌడ్ 30 ఏళ్ల నుండి ఇల్లు లేక ఇంటి అద్దెలో ఉంటూ పెయింటర్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీంతో ఇందిరమ్మ కమిటీ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ దృష్టికి తీసుకువెళ్లి ఇల్లు మంజూరు చేయించి మంగళవారం సర్పంచ్ సంతోష గొండస్వామి ఉప సర్పంచ్ విజయకుమార్ చేతుల మీదుగా ఇల్లు ప్రోసిడింగ్ కార్డ్ ఆర్డర్ ను అశోక్ గౌడు కు అందించారు. స్వామి, ఉప సర్పంచ్ విజయకుమార్ చేతుల మీదుగా అందించారు. అనంతరం లబ్ధిదారుడు అశోక్ గౌడ్ మాట్లాడుతూ, తన ఇల్లు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ కు కృతజ్ఞతలు తెలిపారు.

