ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 14 చిన్న శంకరంపేట:-(కమ్మరి దేవరాజు)

రేణుక ఎల్లమ్మ అమ్మవారి కృపతో జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మెదక్ జిల్లా మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆకాంక్షించారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేటలో శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి 2వ వార్షికోత్సవం నిర్వహించారు. పద్మ దేవేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో మంచి వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు ఆనందంగా ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోలుకూరి లక్ష్మారెడ్డి, సత్యనారాయణ, అంబాజీపేట కొమురవెల్లి నార గౌడ్, సుంకరి చంద్ర గౌడ్, కొమురవెల్లి మల్లేష్ గౌడ్, సుంకరి ఏళ్ళ గౌడ్, సుంకరి స్వామి గౌడ్, సాన మోహన్, రాజ్ కుమార్, తాళ్ల ఈశ్వర్, సుంకరి నాగరాజు, సుంకరి ప్రభు గౌడ్, కొమురవెల్లి బన్నీ, విఠల్, నర్సింలు పాల్గొన్నారు.

