ఏ2టీవీన్యూస్, ఏప్రిల్ 16, నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)
నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారం మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చేతుల మీదుగా బుధవారం తుక్కాపూర్ గ్రామానికి చెందిన పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు దృపత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే చింత లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఉన్నిసా బేగం , మండల అధికారు,సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు తో పాటు ఉపసర్పంచ్ రవీందర్, నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యం గారి సంతోష్ కుమార్ వార్డు సభ్యులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

