ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్17, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
ఈనెల 19న చిన్న శంకరంపేట పట్టణంలోని సాయంత్రం 4 గంటలకు సోమేశ్వర ఆలయం వద్ద నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి హిందువులు అధిక సంఖ్యలో రావాలని హిందూ సమ్మేళన చిన్న శంకరంపేట పట్టణంలో తెలిపారు. దేశానికి ఆత్మ హిందూ ధర్మం, సంస్కృతం, సమాజం అన్నారు. హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి దేశాన్ని విశ్వ గురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925లో ప్రారంభించబడిందన్నారు. ఈ హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా సుశ్రీ స్వామి సునితానంద సరస్వతి (కన్య గురుకుల మాందాపూర్) ముఖ్య వక్త శ్రీ రామ్ ప్రసాద్ సీనియర్ (ఆర్ఎస్ఎస్ ప్రచారకులు) మహిళవక్త శ్రీ గీత అగర్వాల్ (డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్) వస్తున్నారని తెలిపారు.)వారు మాట్లాడుతూ గడప లోపల కులం గడప దాటడానికి హిందువులం ప్రియ బంధువులం అన్నారు. అనంతరం సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ రంగారావు, తదితరులు పాల్గొన్నారు.

