
ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 18,చిన్నశంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాలలో వడదెబ్బ నివారణ, టీబీ నిర్వహణ కొరకు అవగాహన సదస్సులు కల్పించాలని వైద్యాధికారి సాయి సింధుకు సూచించారు. ఆరోగ్య కేంద్రంలో సరిపడ్డ మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో రికార్డులు రిజిస్టర్లు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చేనెల 15వ తేదీ వరకు ఈ అవగాహన సదస్సులు ప్రతి గ్రామంలో నిర్వహించాలని వైద్య అధికారికి సాయి సింధుకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ యాదగిరిరావు, ఎం ఎల్ హెచ్ పి సూపర్వైజర్ బుజ్జి, నర్సింగ్ ఆఫీసర్ అనిత, ల్యాబ్ టెక్నీషియన్ నర్సింలు, రజిత, కొమురయ్య పాల్గొన్నారు.

