ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 18,నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)
ఈనెల ఏడో తారీఖున అనారోగ్యంతో మృతి చెందిన కొల్చారం మండల కేంద్రానికి చెందిన ముత్యం ప్రవీణ్ దశదినకర్మకు హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు. గతంలో నర్సాపూర్ తాలూకా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పనిచేసిన సందర్భంలో వారి ఆధ్వర్యంలో కొల్చారం మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసి రాజకీయ ఓనమాలు నేర్చుకోవడం జరిగింది ఆట్టి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని వారి చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది ఈరోజు మన మధ్యన లేకున్నా ముత్యం ప్రవీణ్ అన్న కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు ఎప్పుడు గుర్తుంటాయని కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటదని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి కౌడిపల్లి గ్రామ సర్పంచ్ కోదండం కృష్ణ గౌడ్ అప్పాజీపల్లి గ్రామ సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ గజిని మెదక్ వ్యాపారవేత్త కరణ్ గుప్తా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

