ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 19,నర్సాపూర్ నియోజకవర్గ ప్రతినిధి (బుచ్చన్న)
మెదక్ జిల్లా కొల్చారం మండలం కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువ నేత ముత్యం ప్రవీణ్ కుమార్అకాల మృతి చెందడం జరిగింది.శనివారం ఆయన దశదినకర్మ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… బి ఆర్ ఎస్ పార్టీలోమంచి పేరున్న నాయకుడు , చురుకైన వ్యక్తి ముత్యం ప్రవీణ్ కుమార్ ఆయన లేని లోటు పార్టీ నాయకులను తనను కలచివేస్తుందని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ముత్యం లాంటి ప్రవీణ్ కుమార్ మృతి చాలా బాధాకరమని మరొకసారి అశ్రు నయానాలతో బాధను, దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా, యువత విభాగం అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు,మాజీ సీడీసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, తాజా మాజీ జెడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్, మాజీ జెడ్పిటిసి పాశం శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ నాయకులుసంతోష్ రెడ్డి,మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పైతర గ్రామ సర్పంచ్ రవితేజ రెడ్డి, కోనాపూర్ గ్రామ సర్పంచ్ మోతుకు నిర్మల మల్లేశం, నాయకులు కరెంటు రాజా గౌడ్, దుర్గం గౌడ్, పాండ్ర వెంకటేశం, తదితరులు శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

