ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 19, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్135వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్ర భారతి లో నిర్వహించినటువంటి రాష్ట్రస్థాయి దళిత అవార్డుల కార్యక్రమంలో మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామ మాజీ సర్పంచ్ మంచాల లక్ష్మణ్ ఈ అవార్డు దక్కగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ , జిల్లా ఎస్పీ దేవి శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక చేతుల మీదుగా ఆ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు రావడంతో దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు మూత్తి గళ్ళ రామచంద్రం, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మురళి మాదిగ చిన్నశంకరంపేట దళిత సంఘాల నాయకులు దొంత దుర్గపతి, నాగరాజు, జంగర్ల గోవర్ధన్, కాడిగళ్ళ మల్లేశం, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

