
ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 19, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)
ఆదివారం కురిసిన అకాల వర్షానికి చిన్న శంకరంపేట మండలంలో రాళ్ల వర్షం కురిసింది. దీంతో రైతన్నలు ఆగమవుతున్నారు. ఉదయం నుండి ఎండ తీవ్రత అధికంగా ఉండి మధ్యాహ్నం సమయంలో వాతావరణం ఒక్కసారి చల్లబడి మేఘావృతమై వర్షం వస్తుంది. పంట కోత దశలో ఉండగా రైతులు ఆందోళన లో ఉండిపోయారు. ఇప్పటికే కోతకు వచ్చిన వరి ధాన్యం కోసి కొనుగోలు కేంద్రాల వద్ద ఆడబోసిన ధాన్యం తడిసింది మామిడి తోటలో మామిడికాయలు మొక్కజొన్న పంట ఈదురుగాళ్లకు కిందపడిపోయింది దీంతో రైతులు నష్టం వాటిల్లింది అకాల వర్షం రైతులకు కన్నీరే మిగులుతుంది

