ఏ2టీవీ న్యూస్ ఏప్రిల్ 20, చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)
సోమవారం చిన్న శంకంపేట మండలం గవ్వల పల్లి లో ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ భూపాల సిద్ధిరాములు, ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించాలని ఉద్దేశంతో గ్రామ గ్రామాన వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈ కేంద్రాలలోనే వరి ధాన్యం రైతులు విక్రయించి మద్దతుగా పొందాలని సూచించారు. కానీ దళాలను నమ్మి వరి ధాన్యాన్ని అమ్మరాదని, మద్దతుల పొందాలంటే వరి కొనుగోలు కేంద్రాలను వరి ధాన్యం విక్రయించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, యాదవ రావు, ఐకెపి సిసి రాజు, గోవింద్, వివో శశిరేఖ యాదగిరి పాల్గొన్నారు.

