ఏ2టీవీ న్యూస్, ఏప్రిల్ 26, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ను కాంగ్రెస్ నాయకులు అప్పాజిపల్లి సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్,(గజినీ) మెదక్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పుల్లబోయిన దుర్గేష్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మండల అభివృద్ధి పనుల కోసం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అనంతరం ఇటీవల మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియామకం అయిన పుల్లబోయిన దుర్గేష్ ముదిరాజ్ ని మంత్రి అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసే నాయకులను గుర్తించి వారికి పార్టీ సముచిత స్థానంకల్పిస్తుందనిపేర్కొన్నారు.

