ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 29, నర్సాపూర్ నియోజకవర్గ సీనియర్ ప్రతినిధి (బుచ్చన్న)
నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలంలోని పీర్యా తాండాలో త్రాగునీటి సమస్య తీవ్రంగానెలకొందని పీరియా తాండ సర్పంచ్ ప్రవళిక రమేష్ రాథోడ్ ఇటీవలజరిగిన సమ్మర్ యాక్షన్ ప్లానింగ్ సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపీ ఓ రామారావు మిషన్ భగీరథ ఏయి అరవింద్ లకు నూతన బోరు వేయుటకు మోటారుమంజూరుకు వివరించడం జరిగిందని ఈ సందర్భంగా స్పందించిన అధికారులు బోరు మంజూరు చేయడం జరిగిందని సర్పంచ్ ప్రవళిక రమేష్ రాథోడ్ తెలిపారు. ఈ బోరు వేయగాపుష్కలంగా నీళ్లు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. తాండ ప్రజలకు తాగునీటి సమస్య తీరిందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.

