ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 29,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)
ప్రతి ఒక్కరికి సమాజంలో చదువు ఎంతో ఉపయోగమని ఆర్థిక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, సైబర్ నేరాలపట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడి సూపర్వైజర్ అంజమ్మ, ఏఎస్ఐ విటల్, అంగన్వాడి కార్యకర్తలు మేడి మాలతీ, వాడు సభ్యుడు కే. ప్రమీల,పాల్గొన్నారు.

