

ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 29,చిన్న శంకరంపేట ప్రతినిధి కమ్మరి (దేవరాజు)
2025 – 26 విద్యాb సంవత్సరానికి వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో తెలంగాణ ఆదర్శ పాఠశాల శంకరంపేట (రా) విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించారు. పాఠశాల స్థాయితో పాటుమండల స్థాయిలో ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం సాధించడం గర్వించదగిన విషయమని తెలిపారు గుండు భవ్యశ్రీ 572/600, గుండు సాహితి 572/600 శాలిపేట, ద్వితీయ స్థానం కే, వైష్ణవి 570/600, తృతీయ స్థానం బెహరా కరిష్మా 567/600, తోపాటు99 మంది విద్యార్థులకు గాను 50 పైగా విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించడమే కాకుండా గత పది సంవత్సరాల నుంచి ఆదర్శ పాఠశాల శత శాతం ఉత్తీర్ణత సాధించడం గర్వించదగిన విషయమని పాఠశాల ప్రధానాచార్యురాలు వాణికుమారి సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా విద్యార్థులందరికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నతమైన స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు.

