ఏ2డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 30, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
తెలంగాణలో అత్యంత శక్తివంతమైన ఆలయాల్లో ఒకటిగా పేరున్న కొండగట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. నీతి అయోగ్ రూపొందించిన దివ్యభారత్ పుస్తకంలో ఈ ఆలయానికి చోటు దక్కడం తెలంగాణ రాష్ట్రానికి, ఈ ఆలయానికి ప్రాధాన్యత సంతరించుకున్నట్లయింది. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు మన దేశంలో ఉన్న ముఖ్యమైన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, దర్శనీయ స్థలాలను పరిచయం చేస్తూ నీతి అయోగ్ సంస్థ దివ్యభారత్ పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకం లో తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కొండగట్టు అంజన్నకు స్థానం దక్కడంతో ఈ ఆలయ చరిత్ర, విశిష్టత దేశవ్యాప్తంగా నే కాకుండా దేశ విదేశాలకు సైతం పాకినట్లు అవుతుంది. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు, భక్తులు ఈ గుర్తింపు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గౌరవంతో కొండగట్టు అంజన్న క్షేత్రం దేశ పర్యాటక పటంలో ప్రాముఖ్యతను సంతరించుకోవడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.

