ఏ2 డిజిటల్ న్యూస్, మే6, చిన్న శంకరంపేట ప్రతినిధి (కమ్మరి దేవరాజు)
తమిళనాడు రాజకీయాల్లో ఇటీవల కొత్త పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో సినీ నటుడు విజయ్ నటుడు రాజకీయ రంగంలో వేగంగా ఎదుగుతున్న తీరు చర్చ నిశ్చయంగా మారిందని మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు దళిత రత్న అవార్డు గ్రహీత బొమ్మల మైసయ్య అన్నారు.స్వల్ప కాలంలోనే తన పార్టీకి గుర్తింపు తీసుకువచ్చి రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపించడం విశేషం.విజయ్ దళపతి వెతుకుదల దళిత సమాజానికి గర్వ కారణమని ఆయన పేర్కొన్నారు. ఒంటరి పోరాటంతో ముందుకు సాగుతూ, చరిత్రాత్మక విజయానికి దారి తీస్తుందన్నారని అభిప్రాయపడ్డారు. అరచేతిని అడ్డం పెట్టి సూర్య క్రాంతిని ఆపలేమని అన్నట్టే ఎంతటి కుట్రలు జరిగిన విజయ్ విజయాన్ని ఆపలేరు అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఎన్నో కష్టాలను అధిగమించి రాజకీయాల్లో నిలదొక్కుకోవడం యువతకు ఆదర్శనమని తెలిపారు సినీ రంగంలో గుర్తింపు పొందిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే తమిళనాడురాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్నానంసంపాదించుకోవడం ప్రశాంసనియమని అన్నారు.యువతకు దేశనిర్దేశం చేస్తూ దళితుల రాజకీయ భాగస్వామ్యమని పెంచే దిశగా విజయ్ కృషి చేస్తారని ఆయన ఆశ భావం వ్యక్తం చేశారు. దక్షిణ భారత దేశంలో దళితులు రాజకీయంగా మరింత బలంగా ఎదగాలని కోరుతూ విజయ్ విజయాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నంత శిఖరాలనుఅధిరోహించాలని కోరారు.

