ఏ2డిజిటల్ న్యూస్, మే 6, సీనియర్ జర్నలిస్టు (బుచ్చన్న)
నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు భూమిపూజా కార్యక్రమంలో టెంకాయ కొట్టి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేష్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వరం లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి చేపడుతున్న పథకాల ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుతున్నారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

