Wednesday, May 6, 2026

చెరువు కట్ట అభివృద్ధి పనులకు శ్రీకారం

ఏ2డిజిటల్ న్యూస్, మే 6, మనోహర బాద్ ప్రతినిధి (రామకృష్ణ)

మనోహరాబాద్ మండలం పరిధిలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న చెరువు కట్ట అభివృద్ధి పనులకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఐటీసీ సంస్థ సహకారంతో చేపడుతున్న ఈ పనులను గ్రామ పాలకవర్గం, రైతులు, సంస్థ ప్రతినిధులు కలిసి భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు.ఈ అభివృద్ధి పనుల ద్వారా చెరువు కట్ట బలపడటంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, భూగర్భ జలాల మట్టం మెరుగుపడే అవకాశముందని పలువురు అభిప్రాయపడ్డారు. దీంతో రైతులకు సాగునీటి సమస్య కొంతవరకు తగ్గే అవకాశముందని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ రైతులు మరియు పాలకవర్గ సభ్యులు ఐటీసీ సంస్థ ప్రతినిధులను అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular